GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10:30 గంటలకు జరగనుంది. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.