MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్థానిక ఎస్సై అనూష సూచించారు. గురువారం ఉదయం ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఆరు గంటలుగా భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు వరద ఉధృతితో ప్రవహిస్తున్నాయని వెల్లడించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని ఆమె కోరారు.