ADB: బేల మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి అన్నారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావును కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు తెలిపారు.