SKLM: ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అంపోలు ప్రధాన జైలును సందర్శించారు. ఖైదీలతో మాట్టాడిన న్యాయమూర్తి వారి అభ్యంతరాలు, సమస్యలు, బెయిల్ పిటిషన్ల పురోగతిపై సమీక్షించారు. ఇప్పటి వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసిన ఖైదీల వివరాలను సేకరించారు. జైలు భద్రత చేపట్టారు.