ELR: సీఆర్.రెడ్డి కాలేజ్ ప్రాంగణంలో NCC విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సును శుక్రవారం పోలీసులు నిర్వహించారు. సైబర్ నేరాల ప్రభావం, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా ప్రమాదాలు మరియు వాటి నుండి రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరంగా తెలియజేశారు. అలాగే సోషల్ మీడియాకు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలన్నారు.