ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన బంగారు బాల్యం మిషన్ సర్వేలో డిఎల్పి ఓ హనుమంతరావు పాల్గొన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థుల కుటుంబాల స్థితిగతులను పరిశీలించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కుటుంబాల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్య అందేలా కృషి చేస్తానన్నారు.