WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో గురువారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సైకాలజిస్ట్ డా. అశోక్ హాజరై, మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఉన్నత స్థాయిలకు చేరుకోవలని సూచించారు.