AP: గతంలో ఉత్తరాంధ్ర గంజాయికి కేంద్రంగా మారిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఐదేళ్లుగా గంజాయి గురించి మాట్లాడిన వారు లేరని తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి రవాణా జరుగుతోందని చెప్పారు. ఏడాదిగా గంజాయిని రూపమాపుతున్నామని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో గంజాయి అనే పదం వినపడకుండా చేస్తామని పేర్కొన్నారు.