VZM: జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఆనంతరం ఎస్.కోట మండలంలో ఉన్న జిందాల్ భూముల సమస్యలను పరిష్కరించి ఏపీ ముఖ్యమంత్రి చేతులు మీదుగా ఎంఎస్ఎంఈ పార్కుగా శంకుస్థాపన జరిగేలా చూడాలని కలెక్టర్ను కోరారు.