అన్నమయ్య: ప్రతి ఒక్కరూ డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టాలని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంఛార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. అన్నమయ్య జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ వారి ఆద్వర్యంలో నేడు అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని కోరారు.