E.G: కొవ్వూరులోని డిగ్రీ కళాశాల వద్ద అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత పాల్గొని, మాట్లాడారు. మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయన్నారు. యువత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు బానిస కాకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దుర్గాప్రసాద్, ఎక్సైజ్ సీఐ పాల్గొన్నారు.