CTR: మాదకద్రవ్యాలను వాడవద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. గురువారం గాంధీ విగ్రహం ఎదుట అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. చెడు వ్యసనాలకు బానిసై యువత జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్నారు. మాదకద్రవ్య వినియోగ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.