ప్రకాశం: మున్సిపల్ కమిషనర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని మార్కాపురం పట్టణ సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు… ఈ సందర్భంగా గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల చేత తమ వేలిముద్ర పడకపోయినా తమ వేతనాలను కటింగ్ చేస్తూ.. తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని వారు ఆరోపించారు.