KMM: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ACP తిరుపతి రెడ్డి అన్నారు. గురువారం తిరుమలాయపాలెం(మం) పిండిప్రోలులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీని ACP ప్రారంభించారు. మాదకద్రవ్యాల వినియోగం పట్ల జరిగే నష్టాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.