HNK:పట్టణ కేంద్రంలోని కమిషనర్ కార్యాలయంలో గురువారం సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, గంజాయి, మద్యం వంటివి జీవితాలను, కుటుంబాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో 2025 జనవరి 1 నుంచి మే 31 వరకు గంజాయి, హాష్ ఆయిల్ కింద 81 కేసులు నమోదయ్యాయని తెలిపారు. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితాన్ని కాపాడుకోవాలని సూచించారు.