SRCL: చందుర్తిమండలం మల్యాల గ్రామానికి చెందిన సంగాని తిరుపతి (32) బ్రెయిన్ స్ట్రోక్తో కరీంనగర్లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. తిరుపతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు.