ATP: రాయదుర్గం స్థానిక సివిల్ జడ్జి కోర్టులో జులై 5న మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవ అధికారి సంస్థ ఛైర్మన్, జడ్జి ఎం.రమ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు ఆవరణలో 5న ఉదయం 10:30 గంటలకు జాతీయ లోక్ అదాలత్ జరగనుందన్నారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సివిల్, కోర్టులో పెండింగ్ ఉన్నవి పరిష్కరించనున్నట్లు తెలిపారు.