AKP: అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో అదాని కంపెనీ నిర్మించనున్న రెండు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పెద్దకోట వద్ద 1,000 నుంచి 1,800 మెగావాట్లకు, రైవాడ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 600 నుంచి 900 పెంచాలని కోరింది.