W.G: మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచే నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు నినాదాలు చేసారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ, అంగన్వాడి సంఘం నాయకురాలు గోడ పెద్దింట్ల, లక్ష్మీ మంగమణి, కామాక్షి శ్వేత, ఆశ కార్యకర్తలు బేబీ, రామలక్ష్మి నాయకత్వం వహించారు.