TPT: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై చేసిన ఆరోపణలు అవాస్తవాలని ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం శోచనీయమని తెలిపింది. శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తోన్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని భూమన ఆరోపించడం అభూత కల్పనలని టీటీడీ పేర్కొంది.