KNR: హుజురాబాద్ నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను (ఐటీసీ) రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రణవ్బాబు తెలిపారు. ఈ సెంటర్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకుల ఉద్యోగ కల్పనకు దోహాదపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.