ATP: ‘తల్లికి వందనం’ పథకం కింద ఎన్పీసీఐ, ఈ కేవైసీ వివిధ రకాల అప్డేట్ ప్రక్రియలు ఇబ్బందులు లేకుండా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకుల వద్ద రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.