సత్యసాయి: గోరంట్ల మండలం గౌనివారిపల్లిలోని రైతు భరోసా కేంద్రం వద్ద శుక్రవారం వేరుశనగ కాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి పాల్గొని రైతులకు వేరుశనగ కాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుతోనే రైతుల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. రైతులు వేరుశనగ కాయలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.