రాజా రామ్మోహన్ రాయ్ భారత సంస్కరణ ఉద్యమ పితామహుడు. ఆయన సతీసహగమనం నిర్మూలన కృషి చేసి, 1829లో చట్టం రాబట్టారు. బ్రహ్మసమాజం స్థాపించి, మత విశ్వాసాల్లో హేతుబద్ధతను ప్రోత్సహించారు. స్త్రీ విద్య, సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడారు. తన జీవితంలో లక్షలాదిమందికి స్ఫూర్తిపరిచిన రామ్మోహన్.. నీతి, ధైర్యం, సంస్కరణలకు నిలువెత్తు స్మారకం.