KMM: రైతుల శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కూసుమంచిలో ఏరువాక కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అనంతరం మంత్రి రైతు సోదరులకు, వ్యవసాయ కూలీలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడి పాడిపంటల ఎగుమతిలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానానికి ఎదగాలన్నారు.