కోనసీమ: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణం డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు పార్కు వద్ద ఆదివారం ఉదయం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నిశాంతి, కౌన్సిలర్ ఆదిబాబు, సాయిబాబు పాల్గొన్నారు.