ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని పెద్ద గోగులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారాముల వారి ఆలయంలో ఆదివారం ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ఉగ్రకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.