HYD: ఈనెల 12న పాఠశాలలు పున:ప్రారంభం కానుండటంతో నిర్వాహకులకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. స్కూల్ బస్సులు ఫిట్గా ఉండాల్సిందేనని.. అలా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. పిల్లలను తీసుకెళ్లే బస్సుకు రవాణా కార్యాలయాల నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని సూచించారు.