JGL: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి ధర్మపురి MLA ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరికి మంత్రి పదవి దక్కింది. సీఎం లక్ష్మణ్ కుమార్కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లు అడ్లూరి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.