SKLM: సరుబుజ్జిలి మండలం కొండ్రగూడ గ్రామంలో ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం రైతులకు అవగాహన సదస్సును నిర్వహించినట్లు స్థానిక శాస్త్రవేత్తలు బాలకృష్ణ, ,శైలజ, కోటేశ్వరరావు, మధు కుమార్ తెలిపారు. విత్తనాలు ఎంపిక, ఎరువులు యాజమాన్యం చీడపీడల నివారణ, పుట్టగొడుగులు, కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించామన్నారు. రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలు తెలిపారు.