KDP: బద్వేల్(మం) లక్ష్మిపాలెంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మిపాలెం మాడవీధుల్లో స్వామివారికి ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.