మన్యం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 9న పార్వతీపురంలో పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పరిశీలించారు. శుక్రవారం అమరావతి నుండి వచ్చిన బృందంతో కలిసి లోకేష్ పర్యటన మార్గాలను పరిశీలించి సంబంధిత నాయకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.