ELR: జూన్ 7న జరగనున్న బక్రీదు పర్వదినాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో పీస్ కమిటీ సభ్యులు, విశ్వ హిందూ పెద్దలు, ఇతర మతాల ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలందరూ కులమత బేధాలు లేకుండా పండగ జరుపుకోవాలన్నారు.