సత్యసాయి: మడకశిర మండలంలో వైస్ ఎంఎంపీ శ్రీరామిరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. రూ.లక్ష నగదు, రెండు బంగారు చైన్లు, రెండు జతల కమ్మలు అపహరించారని సీఐ నాగేశ్ బాబు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.