BPT: తన మీద టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసరావు బుధవారం అధికార పార్టీలో చేరిపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. శ్రీనివాసరావును వాళ్ళు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.