ప్రకాశం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపురం పట్టణ టూ టౌన్ ఎస్సై రాజమోహన్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం పట్టణ శివారు ప్రాంతంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగుతున్న పలువురిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని వారికి హితవు పలికారు.