కోనసీమ: రాజోలులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక నాయకులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించి సభ్యత్వం పొందడం వలన జనసేన పార్టీ అభిమానులకు రూ.5 లక్షల జీవిత భీమా లభిస్తుందని, పార్టీ పదవులలో సభ్యత్వం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.