NGKL: ఆమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఈరోజు పనులు ప్రారంభించారు. గ్రామంలోని లబ్ధిదారులు సుజాత, వెంకటేశ్వర్లు మార్కింగ్ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ ఆనంద రెడ్డి, ఏపీవో రఘుమూర్తి, పంచాయతీ కార్యదర్శి విష్ణు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.