NRML: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం గోదాం వద్ద భద్రత సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. షిఫ్టుల వారీగా భద్రతను పర్యావేక్షించాలని అన్నారు. గోదాం వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు.