SDPT: తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో సిద్దిపేటకు చెందిన రష్మీత రెడ్డి స్వర్ణపతకం సాధించింది. గతంలో జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 31 మంది క్రీడాకారులకు ఇటీవల పోటీలు నిర్వహించారు. అందులో రష్మిత రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది.