SRD: బాలికలకు ఉన్న హక్కులు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సదాశివపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికలకు, మహిళలకు ఉచితంగా సహాయం అందిస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్సై కృష్ణయ్య, ప్రిన్సిపల్ లావణ్య పాల్గొన్నారు.