BDK:దమ్మపేట మండలం దిబ్బగూడెంలో నిర్వహిస్తున్న గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం పాల్గొని ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ టోర్నమెంట్ నిర్వహించుకోవాలని సూచించారు.