KMM: బోనకల్ మండలం మోటమర్రి నుంచి మధిర మండలం సిరిపురం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర రూ. 25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ లైన్లను మంగళవారం విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్ఈ సురేంద్ర ప్రారంభించారు. రెండు మండలాలకు ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా సరఫరా అవుతోందని చెప్పారు.