BDK: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం కోరారు. ఈ సమయంలో రాజకీయ సభలు, సమావేశాలు కార్యక్రమాలు చేపట్టవద్దని, అభ్యంతరకరమైన రాజకీయ సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్లు పంపకూడదన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.