NRML: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని వెంకటాద్రిపేట్లో గల ఓంకారేశ్వర ఆలయాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సోమవారం సందర్శించారు. ఆలయంలో పారిశుద్ధ పనులను దగ్గరుండి మున్సిపల్ సిబ్బందితో చేయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా స్ట్రీట్ లైట్లు, నీటి సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.