మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను పట్టభద్రులు గెలిపించాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సమితి జిల్లా కన్వీనర్ అడేపు లక్మి నారాయణ, ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, నరసింహా కోరారు. సోమవారం జన్నారంలో వారు మాట్లాడుతూ.. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు.