వరంగల్: రాయపర్తి మండలం గన్నరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొకటి రాజు కుమారుడు మొకటి రిషి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపటి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50కేజీల బియ్యం, నూనె డబ్బాను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదిరులు పాల్గొన్నారు.