MNCL: బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంలో ఇంటిని కోల్పోయిన బాధితుడు భీమయ్య కుటుంబ సభ్యులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం పరామర్శించారు. అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి ఎంపీ హామీ ఇచ్చారు.