MBNR: రైతు క్షేమంగాఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం సబ్సిడీ కింద మంజూరైన 20 మంది రైతులకు ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. రానున్న వేసవి కాలంలో పంటలు ఎండిపోకూడదు అనే ఉద్దేశంతో అధికారులతో మాట్లాడి రైతులకు ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేశామన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.