NRML: పట్టణంలోని బంగాల్పేట్ కాలనీలో శుక్రవారం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఇంటింటా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థులైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య, పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.